ఫైనల్‌కు ఏడుగురు బాక్సర్లు

Update: 2024-05-03 16:19 GMT

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. యూత్ మెన్ విభాగంలో ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న వారిలో ఏడుగురు శుక్రవారం ఫైనల్‌కు దూసుకెళ్లారు. బ్రిజేశ్(48 కేజీలు), ఆర్యన్(51 కేజీలు), సాగర్ జాఖర్(60 కేజీలు), యశ్వర్ధన్ సింగ్(63.5 కేజీలు), ప్రియాన్ష్(71 కేజీలు), రాహుల్ కుండు(75 కేజీలు), ఆర్యన్(92 కేజీలు) తమ విభాగాల్లో సెమీస్‌ మ్యాచ్‌ల్లో గెలుపొందారు. సుమిత్(67 కేజీలు), సాహిల్(80 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టారు. సెమీస్ మ్యాచ్‌ల్లో సుమిత్ 0-5 తేడాతో సబిర్ఖాన్ తోరెఖాన్(కజకిస్తాన్) చేతిలో ఓడగా.. జకిరోవ్(కిర్గిజ్‌స్తాన్) చేతిలో అంతే తేడాతో సాహిల్ పరాజయం పాలయ్యాడు. అండర్-22 విభాగంలో నేడు 17 మంది భారత బాక్సర్లు సెమీస్‌ బరిలో నిలువనున్నారు.

Tags:    

Similar News