''రాత్రి 10 పెగ్ల మందు తాగి.. ఉదయం సెంచరీ చేశా..''
రంజీ ట్రోఫిలో మ్యాచ్ ముందుకు రోజు రాత్రి 10 పెగ్ల మందు తాగానని
దిశ, వెబ్డెస్క్: భారత మాజీ టాలెంటెడ్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన కెరీర్లోని ఓ సీక్రెట్ను రివీల్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రంజీ ట్రోఫిలో మ్యాచ్ ముందు రోజు రాత్రి 10 పెగ్ల మందు తాగానని.. దీంతో మా కోచ్ బల్విందర్ సింగ్ నేను ఉదయం నిద్రలేస్తానో లేదో అని ఆందోళన చెందాడని తెలిపాడు. కానీ నేను మాత్రం ఉదయం లేసి.. సెంచరీ బాదానని కాంబ్లీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లే.. నిర్లక్ష్యం, క్రమశిక్షణరాహిత్యంతో అంతే తొందరగా కెరీర్ ముగించాడు. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్గా నిలిచిన వినోద్ కాంబ్లి.. కేవలం 17 టెస్ట్ మ్యాచులు మాత్రమే ఆడి కెరీర్ ముగించాడు. ఆడిన 17 టెస్టుల్లోనే రెండు డబుల్ సెంచరీలు సాధించిన.. క్రికెట్లో సుధీర్ఘంగా కొనసాగలేకపోయాడు.