ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ జోరు.. ఒక్కరోజే మూడు స్వర్ణాలు
ఆర్చరీ వరల్డ్ స్టేజ్-1 టోర్నీలో భారత్ దూసుకుపోతుంది. మహిళల జట్టు, పురుషుల జట్టు, కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో భారత్ పతకాలు సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : ఆర్చరీ వరల్డ్ స్టేజ్-1 టోర్నీలో భారత్ దూసుకుపోతుంది. మహిళల జట్టు, పురుషుల జట్టు, కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో భారత్ పతకాలు సాధించింది. కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్ లో విజయం సాధించింది. ఫైనల్ లో 158-157 తేడాతో ఎస్తోనియా టీంపై గెలుపొందింది.
పురుషుల టీం ఈవెంట్ లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేశ్ తో కూడిన జట్టు అలవోకగా స్వర్ణం గెలిచింది. నెదర్లాండ్ టీంపై 238- 231 తేడాతో అలవోకగా స్వర్ణం సాధించింది. మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్పై భారత్ అమ్మాయిలు గెలుపొందారు. ఇటలీ ప్లేయర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్లో స్వర్ణం గెలిచారు. వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్తో కూడిన టీమిండియా 236-225 తేడాతో ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్పై ఘన విజయం సాధించారు.
ఇకపోతే, రికర్వ్ మిక్స్డ్ టీమ్లో అంకిత బాకత్- బొమ్మదేవర ధీరజ్ జోడీ మెక్సికతో తలపడనుంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.