జగిత్యాలలో ఎస్సై..వరంగల్‌లో కానిస్టేబుల్‌కు కరోనా

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత ఐదు రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్న ఎస్సైకి పరీక్షలు చేయగా, బుధవారం పాజిటివ్ అని రిపోర్టులో వెల్లడైనట్టు వైద్యులు వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకుని ఫ్యామిలీకి.. కరీంనగర్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు(కార్పోరేషన్ ప్రజాప్రతినిధి భర్త)కు ఇప్పటికే పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా అదే కుటుంబంలోని ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కానిస్టేబుల్‌కు పాజిటివ్.. వరంగల్ నగరంలోని […]

Update: 2020-07-01 11:15 GMT

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత ఐదు రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్న ఎస్సైకి పరీక్షలు చేయగా, బుధవారం పాజిటివ్ అని రిపోర్టులో వెల్లడైనట్టు వైద్యులు వెల్లడించారు.

టీఆర్ఎస్ నాయకుని ఫ్యామిలీకి..

కరీంనగర్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు(కార్పోరేషన్ ప్రజాప్రతినిధి భర్త)కు ఇప్పటికే పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా అదే కుటుంబంలోని ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

కానిస్టేబుల్‌కు పాజిటివ్..

వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. అతను రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నందున సన్నిహితంగా ఉన్న ఎస్సై, ఇతర సిబ్బందిని హోం క్వారంటైన్‌కు వెళ్లాలని వైద్యులు సూచించారు.

Tags:    

Similar News