రాజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 52 లక్షలు..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం

Update: 2024-05-02 15:05 GMT

దిశ,వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు. ఈ క్రమంలో గడిచిన 21 రోజులకు గానూ స్వామివారికి రూ. 1 కోటి 52 లక్షల 15 వేల 575 నగదుతో పాటు 218 గ్రాముల బంగారం, 11 కిలోల 500 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈఓడీ.కృష్ణప్రసాద్, కరీంనగర్ ఏ.సీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓ ఎస్.హరికిషన్,జయకుమారి,బి.శ్రీనివాస్,పీ.నవీన్ లతో పాటు ఆలయ సిబ్బంది, శ్రీ రాజ రాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Similar News