ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఓపెనర్లు ఔట్

దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీ 20 పురుషుల వరల్డ్ కప్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తొలుత ఓపెనింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ ఆఫ్రిదీ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరూత్సాహంలో పడ్డారు. ఇక మూడో ఓవర్ వేసిన ఆఫ్రిదీ 3 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్‌ను అవలీలగా తీసుకున్నాడు. దీంతో 6 […]

Update: 2021-10-24 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీ 20 పురుషుల వరల్డ్ కప్‌లో భాగంగా టాస్‌ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తొలుత ఓపెనింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ ఆఫ్రిదీ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరూత్సాహంలో పడ్డారు. ఇక మూడో ఓవర్ వేసిన ఆఫ్రిదీ 3 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్‌ను అవలీలగా తీసుకున్నాడు. దీంతో 6 పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ-సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు.

Tags:    

Similar News