ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.