‘రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు’

దిశ ఏపీ బ్యూరో: ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కి కౌంటర్ ఇస్తూ, తన గెలుపులో తన చరిష్మా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని తెలిపారు. వైజాగ్ లో నలంద కిషోర్‌ది ముమ్మాటికి సహజ మరణం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కంటే అమరావతి సరైనదని తాను నమ్ముతున్నానని ఆయన […]

Update: 2020-07-26 10:30 GMT

దిశ ఏపీ బ్యూరో: ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కి కౌంటర్ ఇస్తూ, తన గెలుపులో తన చరిష్మా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని తెలిపారు. వైజాగ్ లో నలంద కిషోర్‌ది ముమ్మాటికి సహజ మరణం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కంటే అమరావతి సరైనదని తాను నమ్ముతున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News