పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం చేరుకున్న మెగా హీరో వరుణ్ తేజ్.. ఈ సారి మామూల్‌గా ఉండదంటున్న ఫ్యాన్స్ (పోస్ట్)

త్వరలో ఎన్నికలు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో సినీ సెలబ్రిటీలు కూడా రాజకీయాల్లో పాల్గొంటూ.. తెగ సందడి చేస్తున్నారు.

Update: 2024-04-27 08:41 GMT

దిశ, సినిమా: త్వరలో ఎన్నికలు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో సినీ సెలబ్రిటీలు కూడా రాజకీయాల్లో పాల్గొంటూ.. తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు పాలిటిక్స్‌లో పలు పార్టీల తరపున ప్రచారం మొదలెట్టారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నామినేషన్ వేశాడు. దీంతో ఆయనకు సపోర్ట్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలో.. తాజాగా, వరుణ్ తేజ్ నేడు పిఠాపురం చేరుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన ఫ్యాన్స్ జనసేన పార్టీ వారు వరుణ్‌కు పూల మాల వేసి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన ఫ్యాన్స్ ఈసారి మామూల్‌గా ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు.

Similar News