19న టీపీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ఘెరావ్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీ రాజ్ భవన్ ఘెరావ్ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలౌతుందని, లుంబినీ పార్క్ వద్ద జన సమీకరణ చేసి అక్కడ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. […]

Update: 2021-01-17 11:35 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీ రాజ్ భవన్ ఘెరావ్ చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలౌతుందని, లుంబినీ పార్క్ వద్ద జన సమీకరణ చేసి అక్కడ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్‌ హాజరుకానున్నారని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags:    

Similar News