తిరుమల సన్నిధిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి..

దిశ, పటాన్ చెరు: తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూపాల్ రెడ్డి తొలిసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భూపాల్ రెడ్డి వెంట తన సతీమణి గీత, రామచంద్రాపురం మాజీ సర్పంచ్ వెన్నవరం రాజేశ్వర్ రెడ్డి దంపతులు, భారతీనగర్ కార్పొరేటర్ వెన్నవరం సింధు ఆదర్శ్ రెడ్డి […]

Update: 2021-06-18 11:40 GMT

దిశ, పటాన్ చెరు: తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూపాల్ రెడ్డి తొలిసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

భూపాల్ రెడ్డి వెంట తన సతీమణి గీత, రామచంద్రాపురం మాజీ సర్పంచ్ వెన్నవరం రాజేశ్వర్ రెడ్డి దంపతులు, భారతీనగర్ కార్పొరేటర్ వెన్నవరం సింధు ఆదర్శ్ రెడ్డి దంపతులు ఏడుకొండల స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Tags:    

Similar News