CM KCR జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు అయింది. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో రాణించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

Update: 2022-09-09 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు అయింది. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో రాణించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 11న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ రానున్నారు. జాతీయ పార్టీ ప్రకటన అనంతరం ఫ్రంట్‌లు, పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్‌లు, ఫ్లోర్ లీడ‌ర్లతో కీలకంగా చర్చలు జరిపిన కేసీఆర్ అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాధినేతలను, ఇతర పార్టీల నేతలను కలుస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాజాగా. మరో ముందగుడేసి జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు చేయడం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read : ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్.. ఇకపై మరింత కాస్ట్లీగా KCR పర్యటన 

ఇవి కూడా చ‌ద‌వండి : 

సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు

మునుగోడుపై నర్సుల నజర్.. టీఆర్ఎస్‌కు షాకిచ్చేలా పక్కా ప్లాన్

Tags:    

Similar News