ఏప్రిల్ 6న జైపూర్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
గత పది సంవత్సరాలుగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓటమి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది.
దిశ, వెబ్డెస్క్: గత పది సంవత్సరాలుగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓటమి చెందుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను తయారు చేసింది. ఈ ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న జైపూర్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కలిసి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారని ఆ పార్టీ రాజస్థాన్ ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధవా గురువారం తెలిపారు. దీనిపై మీడియా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన సభలో ఈ బహిరంగ సభ ఏర్పాట్లపైనా చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన బాధ్యతలు మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రాలకు అప్పగించారు.