BREAKING: రాష్ట్రాన్ని లూఠీ చేసేందుకు వచ్చిన దోకేబాజ్ రేవంత్‌రెడ్డి: బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్

ప్రజలకు సేవ చేసేందుకు రేవంత్ రెడ్డి రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అని పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు.

Update: 2024-05-10 10:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు సేవ చేసేందుకు రేవంత్ రెడ్డి రాలేదని.. ఉన్నది ఊడ్చుకుపోయేందుకు వచ్చిన దోకేబాజ్ అని పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆమె ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి నారాయణ పేటలో సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో తాను మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తుంటే.. తన గెలుపు పక్కా తెలిసి రేవంత్‌రెడ్డి తన సీఎం పోతుందంటూ ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పాలమూరులో అభివృద్ధి పథంలో నడవాలంటే అరుణమ్మ గెలుపు అవసరమని తెలిపారు. తనపై సీఎం నోటికొచ్చిన భాషలో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. పండబెట్టి తొక్కుతా అంటున్నాడని.. ఆయనకు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దోపిడికి గురైందని. కాంగ్రెస్ పాలనలో ఉన్నది ఊడ్చుకుపోతున్నారని డీకే అరుణ ఓ రేంజ్‌లో మాస్ ర్యాగింగ్ చేశారు. ఓటుకు నోటు కేసుల అడ్డంగా దొరికినోడు కూడా తన గురించి మాట్లాడుతున్నాడని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News