విపక్షాల యూనిటీ పనిచేయదు.. రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు

రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-20 15:29 GMT

న్యూఢిల్లీ: రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల యూనిటీ పనిచేయదని ఆయన అన్నారు. దీనికి కారణం సిద్ధాంతపరంగా అస్థిరత్వాన్ని కలిగి ఉండడమేనని అన్నారు. తాజాగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి సవాల్ విసరాలంటే.. హిందుత్వ, జాతీయత, సంక్షేమం వంటి బలాలను అర్థం చేసుకోవాలని చెప్పారు.

వీటిలో దేనిని అర్థం చేసుకోకపోయినా.. బీజేపీని ఎదుర్కోలేమని అన్నారు. హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే సిద్ధాంతాల కూటమి ఉండాలన్నారు. గాంధీవాది, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు.. భావజాలం చాలా ముఖ్యమైనదని.. అయితే గుడ్డిగా నమ్మొద్దని చెప్పారు. తాను బిహార్‌లో చేపట్టిన జన్ సూరజ్ యాత్ర గాంధీ సిద్ధాంతంతో కూడుకున్నదని అన్నారు.


Tags:    

Similar News