టీడీపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్.. చంద్రబాబు ప్రకటించిన సంచలన హామీలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పోలింగ్‌కు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం

Update: 2024-04-30 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పోలింగ్‌కు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫోస్టోను మంగళవారం విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్, సిద్ధార్థ్ సింగ్, బాబు, ఇతర నేతలు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఆరు ప్రధాన హామీలు ఇవ్వగా.. షణ్ముఖ వ్యూహంతో జనసేన ప్రజాకర్శక హామీలు ప్రకటించింది.

ఎన్డీఏ కూటమి ప్రధాన హామీలు:

= రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

= దీపం పథకం కింద ఏడాదిక మూడు ఉచిత సిలిండర్లు

= యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి

= స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు

= ప్రతి ఇంటికి ఉచిత నళ్లా కనెక్షన్

= ప్రతి మహిళకు నెలకు రూ.1500 (19 సంవత్సరం నుండి 59 సం వరకు)

= బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News