నవ్వుతూ వెళ్లి.. నవ్వుతూ బయటకు వచ్చిన కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Update: 2023-03-20 16:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు కవిత చాలా ఉత్సాహంగా కనిపించారు. పార్టీ కార్యకర్తలను నవ్వుతూ పలకరించారు. అనంతరం పదిన్నర గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా పార్టీ కార్యకర్తలను, మీడియాను నవ్వుతూ పలకరించారు. అలాగే ఈడీ ఆఫీస్ లోపలకి వెళ్లేటప్పుడు భర్త అనిల్ ను కవిత ఆలింగనం చేసుకున్నారు.

ఇక ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత.. దాదాపు పదిన్నర గంటల విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆమె బయటకు రాగానే పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఆ సమయంలో కూడా కవిత నవ్వుతూ చాలా హుషారుగా కనిపించారు. కారులోపలకి వెళ్లేటప్పుడు కవిత మీడియాకు విజయ సంకేతం చూపించారు.

ఇవి కూడా చదవండి :

రేపు ఈడీ విచారణకు మరోసారి ఎమ్మెల్సీ కవిత  

Tags:    

Similar News