నాటుసారా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం

దిశ, అమరావతి: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పీఆర్సీ తండాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఇబి అధికారులు దాడి చేశారు. అప్పుడే కాచడానికి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటు సారా బట్టిలను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ముందు బాబుల కన్ను నాటు సారాపై పడింది. సారా కొనుగోలు పెరుగుతుండటంతో స్థావరాలు కూడా […]

Update: 2020-07-02 07:47 GMT

దిశ, అమరావతి: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పీఆర్సీ తండాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఇబి అధికారులు దాడి చేశారు. అప్పుడే కాచడానికి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటు సారా బట్టిలను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ముందు బాబుల కన్ను నాటు సారాపై పడింది. సారా కొనుగోలు పెరుగుతుండటంతో స్థావరాలు కూడా గుట్టలు గుట్టలుగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నాటు సారా నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతున్నారు.

Tags:    

Similar News