AP News:అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు కాదు..వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు కాదని, అమాయకుడు కాదని వివేకా హత్య కేసు నిందితుడని ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు.

Update: 2024-05-07 14:59 GMT

దిశ ప్రతినిధి,కడప: అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు కాదని, అమాయకుడు కాదని వివేకా హత్య కేసు నిందితుడని ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆరోపించారు. మంగళవారం కమలాపురం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకా హత్య జరిగినప్పుడు ఎంపీ అయి ఉండి సాక్షాధారాలు తుడిచేస్తుంటే పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత ఆయన లేదా అని ప్రశ్నించారు. కమలాపురం ఎమ్మెల్యే మా మేన మామే‌ అని, గాలేరు-నగరి ద్వారా 90 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తాం అన్నారు..ఇచ్చారా అని ప్రశ్నించారు.

రవీంద్రనాథ్ రెడ్డి యదేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు. ఈ ఎంపీ అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు అంట ఒక సర్టిఫికెట్ రవీంద్రనాథ్ ఇస్తాడు, మరో సర్టిఫికెట్ జగన్ ఇస్తాడని అన్నారు. ఈ ఎంపీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా మాట్లాడాడా అన్నారు. వీళ్ళు చిన్న పిల్లలు కాదు అమాయకులు కాదు, సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. అప్పటి వరకు మాకు ఇవన్నీ తెలియదు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ అన్ని అవినాష్ రెడ్డి ఇంటి వైపు చూపించాయన్నారు. 40 కోట్ల సఫారి కూడా మాట్లాడుకున్నారని, 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, అన్ని ఆధారాలు ఉన్నా హంతకులకు శిక్ష పడలేదన్నారు.

Similar News