Breaking:పవన్ కళ్యాణ్‌కు గాయం..అసలేం జరిగింది?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయంతో కనిపించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల నేతలు విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-05-07 14:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయంతో కనిపించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల నేతలు విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో మే 13 పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలో మరికాసేపట్లో జరిగే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో దిగుతున్న పవన్ కళ్యాన్ కాలికి కట్టు ఉంది. జనసేనాని నిదానంగా నడుస్తూ కాన్వాయ్ ఎక్కే సమయంలో పవన్ గాయంతో ఉండటం అందరూ గమనించారు. ఈ గాయానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు. అటు పవన్ గాయంపై జనసేన పార్టీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Similar News