మన్యంలో పోలీసుల తనిఖీలు

దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్ల సీఐ అశోక్ ఆయిల్ బంక్ సెంటర్‌లో, ఎస్ఐ రాజువర్మ పాతచర్ల గాంధీ సెంటర్‌లో సిబ్బందితో కాపుగాచి వాహనాల తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఈ సందర్భంగా మందలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, రాత్రిపూట వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ప్రధాన కూడళ్ళలో తనిఖీలు చేశారు.

Update: 2020-10-15 22:45 GMT

దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్ల సీఐ అశోక్ ఆయిల్ బంక్ సెంటర్‌లో, ఎస్ఐ రాజువర్మ పాతచర్ల గాంధీ సెంటర్‌లో సిబ్బందితో కాపుగాచి వాహనాల తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఈ సందర్భంగా మందలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, రాత్రిపూట వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ప్రధాన కూడళ్ళలో తనిఖీలు చేశారు.

Tags:    

Similar News