వాటి స్థానంలో కొత్త మీటర్లు ఇవ్వండి- సీపీఐ

దిశ,జవహర్ నగర్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో గతవారం స్తంభాలపై షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి మీటర్లు కాలిపోయిన కుటుంబాలకు వెంటనే కొత్త మీటర్లను మంజూరు చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిహెచ్ దశరథ్, జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీటీసీ తోటపల్లి శంకర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జవహర్‌నగర్‌లోని సబ్‌స్టేషన్ ముందు మేడ్చల్ జిల్లా ప్రజా నాట్య మండలి కార్యదర్శి వి. వెంకటాచారి అధ్యక్షతన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ […]

Update: 2021-08-31 06:55 GMT

దిశ,జవహర్ నగర్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో గతవారం స్తంభాలపై షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి మీటర్లు కాలిపోయిన కుటుంబాలకు వెంటనే కొత్త మీటర్లను మంజూరు చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిహెచ్ దశరథ్, జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీటీసీ తోటపల్లి శంకర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జవహర్‌నగర్‌లోని సబ్‌స్టేషన్ ముందు మేడ్చల్ జిల్లా ప్రజా నాట్య మండలి కార్యదర్శి వి. వెంకటాచారి అధ్యక్షతన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్కారం గ్రామంలో గత వారం రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇండ్లల్లో మీటర్లు కాలిపోయిన కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, విద్యుత్ బిల్లు సమయానికి ఇవ్వకపోవడంతో స్లాబ్ రేటు పెరిగి ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అల్వాల్ పట్టణ సహాయ కార్యదర్శి జంగయ్య ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఐలయ్య, మహిళా సమైక్య నాయకురాలు స్వరూప, నరసింహ, సోమారపు నరసింహ, సోమయ్య, రాజేష్, శర్మ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News