తొలి రోజు రూ. 544.55 కోట్లు జమ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. ముందుగా ఎకరా ఉన్న రైతుల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. దీంతో మంగళవారం 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ. 544.55 కోట్లు జమ అయింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెస్సెజ్​లు వెళ్లాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. సీఎం […]

Update: 2021-12-28 09:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. ముందుగా ఎకరా ఉన్న రైతుల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. దీంతో మంగళవారం 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ. 544.55 కోట్లు జమ అయింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెస్సెజ్​లు వెళ్లాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ అమలు చేసే వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రి నిరంజన్​రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News