LJPతో పొత్తుల్లేవ్ : ప్రకాశ్ జవదేకర్

దిశ, వెబ్‌డెస్క్: బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుకొస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమకు ఇష్టం లేకపోయినా జేడీయూ కోసం సిట్టింగ్ స్థానాలను బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మిత్రపక్షం ఎల్‌జేపీతో ఉన్న ఫ్రెండ్ షిప్‌ను బీజేపీ కట్ చేసుకుంది. కారణం సీట్ల సర్దుబాటులో క్లాష్ రావడమే అని సమాచారం. బీహర్ ఎన్నికల్లో పొత్తు అంశంపై […]

Update: 2020-10-17 00:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుకొస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పార్టీ అగ్రనాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమకు ఇష్టం లేకపోయినా జేడీయూ కోసం సిట్టింగ్ స్థానాలను బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మిత్రపక్షం ఎల్‌జేపీతో ఉన్న ఫ్రెండ్ షిప్‌ను బీజేపీ కట్ చేసుకుంది. కారణం సీట్ల సర్దుబాటులో క్లాష్ రావడమే అని సమాచారం.

బీహర్ ఎన్నికల్లో పొత్తు అంశంపై పలువురు బీజేపీని ప్రశ్నించగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఎల్‌జేపీ పార్టీతో ఇకపై ఎలాంటి పొత్తులుండవని ఆయన స్పష్టం చేశారు.గందరగోళ రాజకీయాలను వ్యాప్తి చేయడం తమకు ఇష్టం లేదని.. బీజేపీ ఎవరికీ బీ టీమ్‌గా ఉండదని జవదేకర్ వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తప్పక అధికారంలోనికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News