పంతా నెగ్గించుకున్న నిమ్మగడ్డ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను పునర్నియమిస్తూ ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సూచన మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణే పేరుతో ప్రకటించడంతో గెజిట్ నోటిఫికేషన్ […]

Update: 2020-08-03 00:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

నిమ్మగడ్డ రమేష్ ను పునర్నియమిస్తూ ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సూచన మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణే పేరుతో ప్రకటించడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News