కాసేపట్లో కొత్త సీఎంను ప్రకటించనున్న బీజేపీ హైకామాండ్

దిశ, వెబ్‌డెస్క్ : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు.

Update: 2022-05-14 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్రిపుర సీఎం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామ లేఖను గవర్నర్‌కు శనివారం అందజేశారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారన్న విషయం తెలియాల్సి ఉంది. దీంతో మరికాసేపట్లో.. బీజేపీ హైకామాండ్ కొత్త సీఎంను ప్రకటించనున్నట్లు తెలిపింది. కాగా,  ఇటీవల బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

Similar News