గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ.. సమాధానం చెప్పాలని నిందితులకు నోటీసులు జారీ

న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై ఇవ్వాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-05-03 07:16 GMT

దిశ. డైనమిక్ బ్యూరో: న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై ఇవ్వాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్‌విఎన్ బట్టి ల ధర్మాసనం ఈ కేసులో నిందితులను కూడా ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని పిటీషర్ కు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం నిందితులంతా బెయిల్ పై ఉన్నారని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపగా.. వారి వాదనలు కూడా విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఈ వ్యవహరంపై సీఐడీతో విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను రికార్డు చేసిన ధర్మాసనం.. సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించే విషయంపై సమాధానం చెప్పాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించిన వివరాలలో మరికొన్ని డాక్యుమెంట్లు సీడీలు అందించేందుకు పిటీషనర్ కు ధర్మాసనం అనుమతిని ఇచ్చింది. కాగా ఫిబ్రవరి 17, 2021 న మంథని లో కోర్టు పనులు ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన సతీమణి నాగమణి దంపతులను కొందరు దుండగుల అడ్డగించి నడి రోడ్డుపై కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి చంపేశారు.

Similar News