బీజేపీ ఆఫీసుకు రాహుల్ ఫ్లయింగ్ కిస్సులు..

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

Update: 2022-12-06 13:54 GMT

జైపూర్: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఘాలవార్‌లో ఆయన అందరని దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. రాహుల్ రోడ్డుపై కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ వెళ్తుండగా పక్కనే ఉన్న బీజేపీ భవనంపై కొందరు కాషాయ జెండాలు ఊపుతూ కనిపించారు. ఇది చూసిన రాహుల్ వారికి అభివాదం చేస్తూ, గాల్లో ముద్దులు విసిరారు. అంతేకాకుండా తోటి కార్యకర్తలను కూడా అలాగే చేయాలని ప్రోత్సహించారు. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో విపరీతంగా షేర్ అయింది. కాగా, ఆ భవనం మాజీ సీఎం వసుంధర రాజే పార్టీ కార్యాలయం కావడం గమనార్హం. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోనూ కొందరు వ్యక్తులు మోడీ.. మోడీ అని నినాదాలు చేయగా, వారికి కూడా రాహుల్ తనదైన రీతిలో అభివాదం చేశారు.

Similar News