దేశానికి ఏడాదికి ఒక ప్రధాని.. ఇండియా కూటమిపై మోడీ సెన్సేషనల్ కామెంట్స్

రిజర్వేషన్లపై ప్రధాని మోడీ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమని.. కర్నాటకలో ముస్లింలను

Update: 2024-04-27 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేషన్లపై ప్రధాని మోడీ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమని.. కర్నాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చి.. ఓబీసీ వర్గాలకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా కర్నాటక మోడల్ అమలు అవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఒక వేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దేశానికి ఏడాదికి ఒక ప్రధాని ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారత్‌ను ప్రత్యేక దేశంగా చేయాలంటారని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగానే.. ఏడాదికి ఓ ప్రధాని, ప్రత్యేక దేశంగా దక్షిణ్ భారత్ అంటూ మరోసారి మోడీ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

Similar News