BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లోయలో పడి 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-03-29 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం రంబన్‌ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సీ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాక్సీలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న స్థానిక పోలీసులు, సహాయక బృందాలు మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Similar News