రెండు దశల్లోనూ బీజేపీ కనుమరుగైంది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు

సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని తెలిపారు.

Update: 2024-04-27 07:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా ఉందని ఆరోపించారు. మొదటి, రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. బీజేపీ ఓటర్లను పొందడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలంగా ఉందని తెలిపారు. బీజేపీని విడిపించుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం ఈ రెండు అంశాలే బీజేపీపై ప్రభావం చూపుతాయని తెలిపారు. బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. కాగా, ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండు విడతలు పూర్తైన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News