ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగ భద్రత కల్పించాలి

దిశ, న్యూస్​బ్యూరో: ప్రైవేట్​ విద్యాసంస్థల్లోని టీచింగ్​, నాన్​ టీచింగ్​ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, లాక్​డౌన్​ కాలానికి జీతాలు చెల్లించాలని నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్​ కుమార్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయయని, ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రికి ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఎంటువంటి స్పందన లేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేట్ అధ్యాపకులు కూలీలుగా మారుతున్నారంటేనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు రుజువవుతోందని […]

Update: 2020-07-23 10:28 GMT

దిశ, న్యూస్​బ్యూరో: ప్రైవేట్​ విద్యాసంస్థల్లోని టీచింగ్​, నాన్​ టీచింగ్​ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, లాక్​డౌన్​ కాలానికి జీతాలు చెల్లించాలని నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్​ కుమార్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయయని, ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రికి ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఎంటువంటి స్పందన లేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేట్ అధ్యాపకులు కూలీలుగా మారుతున్నారంటేనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు రుజువవుతోందని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లు గడిస్తూ తమ ఆస్తులను పెంచుకుంటున్నాయి తప్ప సంస్థల అభివృద్ధికి మూలమైన అధ్యాపకులను, సిబ్బందిన పట్టించుకోవడం లేదన్నారు.

Tags:    

Similar News