హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి .. తమిళనాడులో టెన్షన్ వాతావరణం

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న సంగతి

Update: 2022-09-28 07:05 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రెడ్ కాలర్ కారులో వచ్చిన దుండగులు.. విశాల్ ఇంటిపై రాళ్లు విసిరినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇక ఈ సంఘటనపై విశాల్ తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా.. షూటింగ్‌ నిమిత్తం ఆయన బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

అయితే ఈ దాడి వెనుక ఎవరున్నారు? అసలు ఎందుకు దాడి చేశారు? ఇంకా తెలియాల్సి ఉంది. ఇక విశాల్‌కు ఇండస్ట్రీలో శత్రువులు లేకపోయినా రాజకీయాల్లో మాత్రం తనకు చాలా మంది శత్రువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: ఓటీటీలోకి కోబ్రా మూవీ.. ఎందులో అంటే? 

Similar News