'పుష్ప 2' షూటింగ్‌కు బ్రేక్.. ఆందోళనలో అభిమానులు

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'.

Update: 2022-10-22 12:51 GMT

దిశ, సినిమా : అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇదే ఊపులో 'పుష్ప 2'కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఇటీవల మొదలుకానున్న షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా 2 నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:  'హర హర మహాదేవ్'.. తెలుగు పోస్టర్‌ రిలీజ్ చేసిన నాగార్జున 

Tags:    

Similar News