తూచ్.. నేను అలా అనలేదు.. లైంగిక వేధింపులపై ప్లేట్ ఫిరాయించిన Nithya Menen

టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్, ‘కార్తీక దీపం’ ఫేమ్ నిరుపమ్, తిరువీర్, గౌతమి, ప్రేమ్ సాగర్, నరేష్, బాబూ మోహన్ ప్రధాన పాత్రలల్లో వస్తున్న సినిమా ‘శ్రీమతి కుమారి’.

Update: 2023-09-26 14:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్, ‘కార్తీక దీపం’ ఫేమ్ నిరుపమ్, తిరువీర్, గౌతమి, ప్రేమ్ సాగర్, నరేష్, బాబూ మోహన్ ప్రధాన పాత్రలల్లో వస్తున్న సినిమా ‘శ్రీమతి కుమారి’. ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నిత్య మీనన్. ఈ క్రమంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ సినిమా షూటింగ్ టైమ్‌లో తమిళ హీరో తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు నిత్య చెప్పినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఇదే విషయమై సినీ క్రిటిక్ మనోబాల నిత్యామీనన్‌ను సంప్రదించగా.. తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.. నిత్యా మీనన్ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. నిన్న అలా చెప్పి ఈ రోజు కాదు అనడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఆఫర్లు రావని భయపడుతున్నావా..? లేక ఎవరైనా బెదిరించారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధైర్యం లేనప్పుడు లైంగిక వేధింపులపై మాట్లాడటం ఎందుకు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News