మళ్లీ సమస్యలు స్టార్ట్.. నయనతారకు మొదలైన సవితి పోరు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ నటికి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా

Update: 2024-04-16 15:25 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ నటికి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతాయి. ఇక నయన్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వీరు సరోగసి ద్వారా ఇద్దరు కవలపిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

ఇక పెళ్లి తర్వాత ఈ జంట చాలా సమస్యలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నయనతారకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?

తాజాగా నయనతారకు సవితి పోరు స్టార్ట్ అయ్యిందంటూ కోలివుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.సవతి పోరు అంటే అలాంటి ఇలాంటి సవితి పోరు కాదు సినిమాలలో సవతి పోరు.ఎందుకంటే కోలివుడ్ లో ద బెస్ట్, అండ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ అంటే నయనతార, త్రిషనే. అయితే నయన్ దర్శకుల నుంచి ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటంతో , డైరెక్టర్స్ తనను కాదని త్రిషకు అవకాశాలు ఇస్తున్నారంట. దీంతో చిత్రపరిశ్రమలో నయన్‌కు సవితిపోరు మొదలైంది. పాపం నయనతార, త్రిషను తట్టుకోలేక తలనొప్పి తెచ్చుకుంటుందని కొందరు గుసు గుసలాడుతున్నారు.

Similar News