గచ్చిబౌలిలో శ్రీలీల.. ఇద్దరు హీరోయిన్లకు చాలెంజ్ విసిరిన బ్యూటీ

బ్యూటిఫుల్ శ్రీలీల గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది.

Update: 2023-02-10 12:32 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ శ్రీలీల గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది. గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ లో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 17 కోట్ల మొక్కలు నాటడాన్ని గొప్ప విషయంగా పేర్కొంది. ఇక హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ్, అనుపమ పరమేశ్వరన్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన బ్యూటీ.. తన అభిమానులు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చింది.

Tags:    

Similar News