Keerthy Suresh: అతనంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పేసిన కీర్తి

సీనియర్ నటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.

Update: 2023-03-26 07:33 GMT

దిశ, సినిమా: సీనియర్ నటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ మూవీలో నటించిన కీర్తి సురేష్ తన నటనకు నేషనల్ అవార్డ్ అందుకుంది. ప్రస్తుతం నానికి జంటగా ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారబోతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై వెళ్లిన కీర్తి.. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబులు చెప్పింది. ‘మీరు బాలీవుడ్‌లో నటించాలనుకుంటున్నారా?’ అని అడగగా.. ‘అవును నాకు బాలీవుడ్‌లో నటించాలని ఉంది. షారుఖ్‌ అంటే చాలా పిచ్చి. ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకోను. ఏదో ఒకరోజు ఆయనతో సినిమా చేస్తాను’ అంటూ మనసులో మాట బయటపెట్టింది. 

Tags:    

Similar News