సాయిపల్లవి కారణంగా విడాకులు తీసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన న్యూస్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-04-27 09:44 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ‘ఫిదా’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో స్టార్‌డమ్‌ను తెచ్చుకున్న ఈమె.. ఇప్పటికి కూడా అదే క్రేజ్ మెయింటేన్ చేస్తుంది. ఇక ఎంచుకునే సినిమాలు, కథలో ప్రాధాన్యంతో మూవీస్ చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది. ఎటువంటి స్కిన్ షో చెయ్యనప్పటికీ సాయి పల్లవి అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోతారు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. అదేంటంటే.. సాయిపల్లవి దెబ్బకి ఏకంగా ఇద్దరు హీరోలు విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏడేళ్లు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని అనివార్య కారణాల చేత 2021 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నారు. అయితే.. వీరి విడాకులకు ముందు చైతు, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ సినిమా వచ్చింది.

ఇక సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కూడా.. ప్రస్తుతం విడాకులు తీసుకోబోతున్నారు. అసలు 2022లో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కానీ అప్పుడు వెనుకడుగు వేశారు. కానీ మళ్లీ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన సినిమా ‘మారి2’. ఈ సినిమా తర్వాత ధనుష్ విడాకుల ఇష్యూ స్టార్ట్ అయింది. దీంతో ఈ రెండు సినిమాలను, విడాకులు కంపేర్ చేస్తూ.. సాయి పల్లవితో సినిమా అనంతరం ఈ ఇద్దరు హీరోలు విడాకులు తీసుకున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Similar News