AP గురించి ఒక్క ముక్కలో చెప్పేసిన పూనమ్.. ఎలక్షన్ల టైంలో కాకరేపుతున్న నటి పోస్ట్!

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి తెలిసిందే.

Update: 2024-04-27 10:52 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి తెలిసిందే. ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మూవీస్‌కు దూరంగా ఉంటూ.. రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. రాజకీయ నేతలపై, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలపై పెట్టే పోస్ట్‌లు నెట్టింట చర్చనీయాంశంగా మారతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల బరిలో గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మే 13వ తేదీన పోలీంగ్ ఉండగా.. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరు పెంచారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ AP గురించి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఈ మేరకు ‘ఏపీ ఈజ్ ద న్యూ యూపీ’ అంటూ తన X ఖాతా ద్వారా పోస్ట్ పెట్టింది. ఏపీని ఉత్తర ప్రదేశ్‌తో పోల్చుతూ పూనమ్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ఈ టైంలో ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది అంటూ జుట్లు పీక్కుంటూ ఆలోచిస్తున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News