Interesting Scene: ఓట్ల కోసం కాళ్లు పట్టుకుంటున్న నేతలు.. ఫొటోలు వైరల్

Update: 2024-05-09 04:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే వారి ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. అవసరమైతే కాళ్లు పట్టుకుంటున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, టీచర్లు ఓటు హక్కు వినిగించుకున్నారు. అయితే పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఉద్యోగుల కాళ్లు పట్టుకుని వైసీపీ నేతలు ఓట్లు అభ్యర్థించారు. దీంతో కొందరు ఉద్యోగులు అవాక్కయ్యారు. అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇప్పుడు కాళ్లు పట్టుకుంటారని, పోలింగ్ అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

Read More..

AP Politics:ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్త్‌ని నిర్ణయిస్తాయి..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Similar News