ఏపీలో ఆ పార్టీదే అధికారం.. వైరల్ అవుతున్న చిలక జోస్యం

ఏపీలో ఆ పార్టీదేనంటూ చిలక జోస్యం వైరల్ అవుతోంది...

Update: 2024-05-09 05:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా వైసీపీనా.. కూటమినా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అయితే ఓ చిలక జోస్యం వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు పెట్టి ఇద్దరిలో ఎవరు సీఎం అవుతారని జ్యోతిష్యుడు అడగడం... వెంటనే చిలక పంజరం పెట్టెలో నుంచి బయటకు వచ్చింది. జ్యోతిష్యుడు వెళ్లను చూసింది. అయితే జ్యోతిష్యుడు తన వెళ్లను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత చిలక ఓ ఫోటో తీసింది. దీంతో ఆ పార్టీకే అధికారం వస్తుందని జ్యోతిష్యుడు అంచనా వేశారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ చిలక జోస్యం చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబురపడిపోతుంటే.. టీడీపీ, జనసేన శ్రేణులు, కామన్ పీపుల్స్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇదంతా వైసీపీ నేతల పాలిట్రిక్స్ అంటూ కొట్టిపారేశారు. కానీ చిలక జోస్యం.. జ్యోతిష్యుడి వేళ్లపై ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. సో.. జోతిష్యం నిజమవుతుందా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఎన్నికల విజయం ఎవరిదనేది పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడితేగాని క్లారిటీ రాదు. ప్రస్తుతం ఈ చిలక జ్యోతిష్యం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూడాలి ఏం జరుగుతుందో..?. 

Read More..

అటు హైకోర్టు.. ఇటు ఈసీ.. మధ్యలో జగన్.. తీర్పుపై ఉత్కంఠ 

Tags:    

Similar News