ఇందిరాదేవి మరణంతో ఆ సినిమా అప్డేట్స్ను ఆపేసిన ఇద్దరు హీరోలు..!
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి తెల్లవారు జామున మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వార్త విన్న సినీ ఇండస్ట్రీ షోక సముద్రంలో మునిగిపోయింది.
దిశ, వెబ్డెస్క్: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి తెల్లవారు జామున మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వార్త విన్న సినీ ఇండస్ట్రీ షోక సముద్రంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు కృష్ట సతీమణి ఇందిరా దేవి పార్ధివ దేహానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు నివాళులు అర్పించారు. అంతే కాకుండా అల్లరి నరేష్, సుధీర్ బాబు తమ రాబోయే సినిమా కీలక అప్డేట్స్ను గౌరవ సూచికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. హంట్తో పాటు ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాల అప్డేట్స్ ను వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వీరి నిర్ణయాన్ని మహేష్ అభిమానులు సినీ పెద్దలు అభినందిస్తున్నారు. ఇందిర చివరి రోజుల్లో మహేష్ బాబు అమెతో పూర్తిగా గడిపారు. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో త్రివిక్రమ్తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ను మహేశ్ బాబు ముందే నిలిపివేసినట్లు తెలుస్తోంది.