తల్లి, కొడుకు అదృశ్యం.. కుటుంబ కలహాలే కారణమా..?

దిశ, కంది : కుటుంబ కలహాలతో వివాహిత తన కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సంగారెడ్డిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో జంగం ఈశ్వరయ్యతో భార్య నిర్మల (30), కొడుకు చరణ్ (11) నివాసం ఉంటున్నారు. కాగా, ఈ నెల 23న ఆయన భార్య నిర్మల కొడుకుతో కలిసి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

Update: 2021-12-27 02:13 GMT

దిశ, కంది : కుటుంబ కలహాలతో వివాహిత తన కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సంగారెడ్డిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో జంగం ఈశ్వరయ్యతో భార్య నిర్మల (30), కొడుకు చరణ్ (11) నివాసం ఉంటున్నారు. కాగా, ఈ నెల 23న ఆయన భార్య నిర్మల కొడుకుతో కలిసి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9490617010, 08455-276333 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ సూచించారు.

 

Tags:    

Similar News