ఓట్ల కోసం వ్యక్తిగత విమర్శలు సరికాదు :పువ్వాడ

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు ఓట్లు.. నాలుగు సీట్ల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు పువ్వాడ అజయ్ కుమార్. తన నియోజకవర్గంలో మీ ఆటలు సాగవని.. మీ విభజన రాజకీయాలు తన జిల్లాలో చెల్లవని హెచ్చరించారు. మీకు చేతనైతే తన మీద ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని అన్నారు. దమ్ముంటే ఆరోపణలపై విచారణ చేయించు అని సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో ప్రజలే […]

Update: 2021-01-10 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు ఓట్లు.. నాలుగు సీట్ల కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు పువ్వాడ అజయ్ కుమార్. తన నియోజకవర్గంలో మీ ఆటలు సాగవని.. మీ విభజన రాజకీయాలు తన జిల్లాలో చెల్లవని హెచ్చరించారు. మీకు చేతనైతే తన మీద ఒక్క ఆరోపణనైనా నిరూపించాలని అన్నారు. దమ్ముంటే ఆరోపణలపై విచారణ చేయించు అని సవాల్ విసిరారు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ది చెప్తారని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News