‘డబుల్’ ఇళ్లు పంపిణీ చేయనున్న కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం జియాగూడ, గోడేకి కబర్, కట్టెలమండి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం రూ.95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందజేయనున్నారు. కాగా అకాల వర్షాల కారణంగా, వరదలు బీభత్సం సృష్టించి, బురదమయంగా మారిన ప్రాంతాల ప్రజలు, నేటి నుంచి డబుల్ బెండ్ రూం ఇళ్లలో కనిపించనున్నారు. అయితే ఈ ఇళ్లలో ప్రజల […]

Update: 2020-10-25 21:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం జియాగూడ, గోడేకి కబర్, కట్టెలమండి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం రూ.95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందజేయనున్నారు. కాగా అకాల వర్షాల కారణంగా, వరదలు బీభత్సం సృష్టించి, బురదమయంగా మారిన ప్రాంతాల ప్రజలు, నేటి నుంచి డబుల్ బెండ్ రూం ఇళ్లలో కనిపించనున్నారు. అయితే ఈ ఇళ్లలో ప్రజల జీవనానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను ఇప్పటికే కల్పించామని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News