కాంగ్రెస్కు ఆ నాలుగు సెగ్మెంట్లు కీలకం.. పక్కా గెలవాల్సిందే: మహేష్కుమార్ గౌడ్
మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లలో పార్లమెంట్ కో ఇన్ చార్జ్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లలో పార్లమెంట్ కో ఇన్ చార్జ్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ, మెదక్ కు జగ్గారెడ్డి, జహీరాబాద్ కు మదన్ మోహన్ రెడ్డి, చేవెళ్లకు టీ రామ్మోహన్ రెడ్డి లను నియమించారు. ఈ నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను తప్పనిసరిగా ఎగురవేయాలని హైకమాండ్ టాస్క్ ను ఇచ్చింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది.