చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: కొడాలి నాని

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్​ హైదరాబాద్ ​ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఇంకా జాతీయ పార్టీగా చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజల నేత సీఎం జగన్​ను ఢీ కొడతాననడం అవివేకమన్నారు. చంద్రబాబు టీడీపీని గాలి పార్టీగా తయారు చేసి ఆయన గాలి నాయకుడిగా మిగిలిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్​ […]

Update: 2020-12-05 09:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గ్రేటర్​ హైదరాబాద్ ​ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ఇంకా జాతీయ పార్టీగా చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజల నేత సీఎం జగన్​ను ఢీ కొడతాననడం అవివేకమన్నారు. చంద్రబాబు టీడీపీని గాలి పార్టీగా తయారు చేసి ఆయన గాలి నాయకుడిగా మిగిలిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్​ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేసినట్లు మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News