అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

ఏలూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నూజివీడు ఆర్ఆర్ పేటలో 16 సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Update: 2024-05-03 09:57 GMT

దిశ, నూజివీడు:ఏలూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నూజివీడు ఆర్ఆర్ పేటలో 16 సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మృతుడు ఒక బిల్డింగ్ పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ముందు భావించారు. కానీ మృతుడి బెడ్ రూమ్‌లో రక్తపు మరకలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీసింది. మృతుడు అమరావతి ఫర్నిచర్స్ యజమాని కోవూరి రామారెడ్డి కుమారుడు సాయి యశ్వంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నూజివీడు పట్టణ సీఐ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News