వాళ్ళు ఎంత..! మెగా ఫ్యామిలీకి బయపడి మాట్లాడుతున్నారు అని కామెంట్ చేసిన రోజా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సుధీర్, ఆది (వీడియో)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల వేడి రాజుకుంది.

Update: 2024-05-03 11:02 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు బరిలో గెలుపొందేంకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మే 13వ తేదీన పోలీంగ్ ఉండగా.. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరు పెంచాయి. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మేల్య అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆయనకు సపోర్ట్‌గా ఇప్పటికే పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ప్రచారాలు మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ప్రచారాలకు టీవీ వాళ్లను కూడా తీసుకొస్తున్నారు కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటని మీడియా వాళ్లు మంత్రి రోజను ప్రశ్నించారు.

దీనిపై మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘వాళ్లు, వాళ్ల ప్రాణం ఎంత. వాళ్లు మాట్లాడుతున్నారు అంటే.. ఎవరు మాట్లాడిస్తున్నారో ఆలోచించాలి. కానీ వాళ్లను (సుధీర్, ఆది) అని వేస్ట్. వాళ్లు ఎంత చెప్పండి పాపం. వాళ్లు చిన్న చిన్న షోస్, క్యారెక్టర్స్ చేసుకునే వాళ్లు. మెగా ఫ్యామిలీలో 6,7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి.. వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఇక వాళ్లకి సినిమా ఇండస్ట్రీలో ఏమి లేకుండా చేస్తారు అనే భయంతోనే మెగా కుటుంబంతో ఉన్నారు కానీ, ప్రేమతో ఎవ్వరు లేరు. ప్రేమ వేరు భయం వేరు. అలాంటి వాళ్ల కోసం చిన్న చిన్న వాళ్లను తిట్టాలని నేను అనుకోను’ అంటూ చెప్పుకొచ్చింది.

దీనిపై సుధీర్, ఆది స్పందిస్తూ.. ‘మేము పవన్ కల్యాణ్ అభిమానులుగా వచ్చాము. ఇంకా జబర్దస్తో లేకపోతే సినిమాల్లో చెయ్యక ముందు నుంచే చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు అభిమానులం. మేము ఇక్కడికి యాక్టర్స్‌లా రాలేదు. ఆయన అభిమానిగా వచ్చి.. ఆయన కోసం ప్రచారం చేస్తున్నాము. మేము కమెడీయన్స్ అని అన్నారు. అయితే.. మేము ప్రోఫిషనల్‌గా కమెడీయన్స్. వాళ్లల పొలిటికల్ కమెడీయన్స్ అయితే కాదు’ అంటూ రివర్స్ కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Similar News